Advertisement

నాని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!

Sun 24th Jul 2016 02:50 PM
nani,maniratnam,saiyami kher,maniratnam movie with nani,karthi  నాని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!
నాని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!
Advertisement

దేశం గర్వించదగ్గ దర్శకుల్లో మణిరత్నం ఒకరు. ఆయన తీసిన పలు చిత్రాలు కళాఖండాలుగా నిలిచాయి. ఇటీవల కొద్దికాలంగా ఆయన తీసిన చిత్రాలు పెద్దగా ఆడలేదు. దీంతో మణిరత్నం పనైపోయిందనే విమర్శలు వచ్చాయి. కానీ తాను మాత్రం ఈ జనరేషన్‌ అభిరుచికి తగ్గట్లుగా మారి ఆయన తీసిన 'ఓకే బంగారం' చిత్రం మరలా ఆయనకు మంచి బ్రేక్‌నిచ్చింది. మణిరత్నం ఈమధ్య కార్తి, నాని, నిత్యామీనన్‌, సయామీ ముఖ్యపాత్రల్లో ఓ మల్టీస్టారర్‌ను ప్లాన్‌ చేశాడు. కానీ ఈ చిత్రం పట్టాలెక్కలేదు. దీంతో ప్రస్తుతం ఆయన కార్తి, ఆదితిరావు హైదర్‌లు జంటగా ఓ రొమాంటిక్‌ డ్రామాను సెట్స్‌పైకి తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఆయన ఈ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం షూటింగ్‌లో ఉండగానే ఆయన చేయాలనుకుని ఆగిపోయిన కార్తి,నాని, నిత్యామీనన్‌, సయామిల చిత్రం గురించి ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సయామి మాట్లాడుతూ, మణిరత్నం సార్‌ ప్లాన్‌ చేసిన మల్టీస్టారర్‌ చిత్రం ఆగిపోలేదని, ఈ ఏడాది చివరలో ఈ చిత్రం ప్రారంభం అవుతుందని తెలిపింది. మొత్తానికి నాని నటించే మణిరత్నం చిత్రం ఆగిపోలేదన్న వార్త అందరికీ సంతోషాన్ని కలిగిస్తోంది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement