Advertisement

ఉచితంగా పాట చేస్తోన్న శృతిహాసన్‌!

Fri 24th Apr 2015 11:28 AM
sruthihaasan,vamsi pydipalli,new movie,nagarjuna,karthi  ఉచితంగా పాట చేస్తోన్న శృతిహాసన్‌!
ఉచితంగా పాట చేస్తోన్న శృతిహాసన్‌!
Advertisement

వంశీపైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున, కార్తిలు హీరోలుగా పివిపి సంస్థ నిర్మిస్తున్న చిత్రం నుండి శృతిహాసన్‌ తప్పుకోవడం, విషయం కోర్టుదాకా వెళ్లడం.. చివరకు రాజీ కుదరడం తెలిసిన సంగతే. కాగా ఈ చిత్రం కోసం నిర్మాతలు శృతిహాసన్‌కు 10లక్షల అడ్వాన్స్‌తోపాటు కాస్ట్యూమ్స్‌ కోసం మరో 8లక్షలు ఇచ్చారట. వాటిని తిరిగి ఇవ్వమని నిర్మాత కోరితే.. తాను డబ్బులు తిరిగి ఇవ్వలేనని, దాని బదులు అదే సంస్థ అనుష్క ప్రధానపాత్రలో నిర్మిస్తున్న  ‘సైజ్‌ జీరో’ చిత్రంలో ఉచితంగా ఓ పాటను చేస్తానని చెప్పి అందుకోసం 4రోజుల డేట్స్‌ ఇచ్చిందిట. ఎలాగూ ఈ చిత్రంలో శృతిహాసన్‌ చేత ఓ ఐటంసాంగ్‌ చేయించాలని ప్రయత్నించిన నిర్మాత తనకు ఏదైనా ఒక్కటే అని తేల్చిచెప్పి, మరలా ఆ పాట చేసేటప్పుడు తలనొప్పులు తీసుకొని రావద్దని శృతికి గట్టిగా వార్నింగ్‌ ఇచ్చాడని సమాచారం.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement