నటునిగా, దర్శకునిగా, రచయితగా, నిర్మాతగా దక్షిణాదిన తనదైన ముద్ర వేసిన లోకనాయకుడు కమల్హాసన్ ఇప్పుడు బాలీవుడ్ నిర్మాతగా మారబోతున్నాడు. వీరేంద్రఅరోరా, అర్జున్ కె.కపూర్లతో కలిసి త్వరలో ‘అమర్హై’ అనే సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నాడు. ఇందులో కమల్హాసన్ ప్రధానపాత్రలో కనిపిస్తాడు. ఆయనతో పాటు మరో ప్రముఖ నటుడు కూడా ఇందులో కీలకపాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుత రాజకీయాలు, మనీలాండరింగ్ తదితర అంశాలపై ప్రశ్నలు సంధించేలా ఈ చిత్రం ఉండబోతోంది. ఈ చిత్రాన్ని నవంబర్లో పట్టాలెక్కించి కేవలం 5నెలల్లో షూటింగ్ను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.