Advertisement

కథ అడ్డం తిరిగింది..!

Thu 05th Feb 2015 07:34 AM
shriya saran,gopala gopala,bollywood media,interview  కథ అడ్డం తిరిగింది..!
కథ అడ్డం తిరిగింది..!
Advertisement

తెలుగులో స్టార్ హీరోయిన్ గా చెలామణి అయ్యి ఇప్పుడు బాలీవుడ్ లో రాణిస్తున్న నటి శ్రియశరన్. బాలీవుడ్ లో బిజీగా ఉన్నా.. అదే సమయంలో తెలుగు సినిమాలలో కూడా నటిస్తుంది. తెలుగులో శ్రియ రీసెంట్ గా నటించిన 'మనం' , 'గోపాల గోపాల' హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు 'గోపాల గోపాల'లో శ్రియ నటించిన పాత్ర తనకు తలనొప్పి గా మారింది. అందులో శ్రియ తల్లి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. అయితే బాలీవుడ్ మీడియా మాత్రం శ్రియకు వయస్సు అయిపోతుందని అందుకే అలాంటి పాత్రలో నటించిందని పదేపదే పబ్లిష్ చేస్తుంది. దీనిపై ఘాటుగా స్పందించిన శ్రియ ఒక ఇంటర్వ్యూలో ''అవును, నేను తల్లి పాత్రలో నటించాను, అయితే ఏంటి? నేను ఒక నటిని, నటించడం నా ప్రొఫెషన్. నాకు ఏ పాత్ర సంతృప్తిని ఇస్తుందో ఆ పాత్రలో నేను నటిస్తాను" అని చెప్పిందట. 

 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement