Advertisement

కొత్త వారి కోసమే అంటున్న టాప్ హీరో..!

Thu 29th Jan 2015 03:18 AM
akshay kumar,trisha,vinay virmani,sruthi hasan  కొత్త వారి కోసమే అంటున్న టాప్ హీరో..!
కొత్త వారి కోసమే అంటున్న టాప్ హీరో..!
Advertisement

కొత్త వారితో వర్క్ చేయడం వారి టాలెంట్ ని ప్రోత్సహించడం నాకు ఇష్టం. అందుకే నా బ్యానర్ హరి ఓం ఎంటర్ టైన్మెంట్ లో ఎక్కువగా కొత్త వారితోనే సినిమాలను తీస్తాను అంటున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. ఈ బ్యానర్ లో చాలా మంది కొత్త దర్శకులకు, హీరోలకు, హీరోయిన్లకు బ్రేక్ ఇచ్చాడు. అక్షయ్ బ్యానర్ ద్వారా పరిచయమైన కొత్త యాక్టర్స్ త్రిషా కృష్ణన్ (కట్టా మీటా), వినయ్ విర్మాణి (బ్రేక్ అవే) లకు మంచి పేరు వచ్చింది. 47 ఏళ్ళ అక్షయ్ కొత్త డైరెక్టర్స్ తో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పని చేస్తాడు. తను నటించిన 'ఎంటర్ టైన్మెంట్' , 'కిలాడి 786' చిత్రాలు కొత్త దర్శకులతో పరిచయమైనవే. అక్షయ్ చేయబోయే తదుపరి చిత్రం 'మెయిన్ గబ్బర్'. ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించనుంది.   

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement