Advertisement

రవితేజ ని టచ్ చేసి చూస్తారా..!

Thu 26th Jan 2017 12:19 AM
raviteja,touch chesi choodu,january 26,vikram sirikonda  రవితేజ ని టచ్ చేసి చూస్తారా..!
రవితేజ ని టచ్ చేసి చూస్తారా..!
Advertisement

రవితేజ హీరోగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో నల్లమలుపు బుజ్జి - వల్లభనేని వంశీ నిర్మాణంలో 'టచ్ చేసి చూడు'

'మాస్ మహారాజా' రవితేజ హీరోగా 'టచ్ చేసి చూడు' పేరుతో ఓ భారీ చిత్రం రూపొందనుంది. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. విక్రమ్ సిరికొండ దర్శకునిగా పరిచయవుతున్నారు .జనవరి 26 (గురువారం) రవితేజ బర్త్ డే సందర్భంగా  ఈ సినిమా వివరాలను దర్శక నిర్మాతలు అధికారికంగా వెల్లడించారు. నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ మాట్లాడుతూ - మాకు చిరకాల మిత్రుడైన రవితేజ తో ఈ సినిమా నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మాస్ మహారాజా ఇమేజ్ కి తగ్గట్టుగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అద్భుతమైన కథను తయారు చేసారు. ఫిబ్రవరి మొదటి వారంలో చిత్రీకరణ మొదలు పెడుతున్నాం... అని తెలిపారు. దర్శకుడు విక్రమ్ సిరికొండ మాట్లాడుతూ - ఇదొక డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్.ఇందులో ఇద్దరు కథానాయకులుంటారు. ఇప్పటికే రాశి ఖన్నాను ఎంపిక చేసాం. మరొక నాయికను త్వరలోనే ప్రకటిస్తాం.హేమాహేమీలైన సాంకేతిక బృందం ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.. అని చెప్పారు.

ఈ చిత్రానికి

సంగీతం : ప్రీతమ్స్ ఎ అండ్ ఆర్ వెంచర్ జామ్ 8

కథ :  వక్కంతం వంశీ.

స్క్రీన్ ప్లే : దీపక్ రాజ్.

మాటలు : శ్రీనివాస్ రెడ్డి.

అడిషనల్ డైలాగ్స్: రవిరెడ్డి, మల్లు

ఎడిటింగ్ : గౌతం రాజు.

ఆర్ట్: రమణ.

కో డైరెక్టర్ : రాంబాబు.

ఛాయాగ్రహణం : ఎం. సుకుమార్.

యాక్షన్ : పీటర్ హేన్స్.

నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ.

దర్శకత్వం : విక్రమ్ సిరికొండ.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement