Advertisement

మృత్యుంజయ హోమం విజయవంతం..!

Wed 25th Mar 2015 08:36 AM
thalasani sreenivas yadav,muralimohan,mruthyunjaya homam,swaroopanandendraswamy  మృత్యుంజయ హోమం విజయవంతం..!
మృత్యుంజయ హోమం విజయవంతం..!
Advertisement

ఈ మధ్యకాలంలో చిత్ర పరిశ్రమకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు అనారోగ్య కారణాలతో అకాల మృత్యువుకు గురి కావడం అందర్నీ బాధిస్తున్న విషయం. ఇంతమంది అకాల మరణం చెందడం దుష్టశక్తి ప్రభావమని కొందరు పెద్దలు భావిస్తున్నారు. ఈ విషయమై రాజమండ్రిలో వేదపండితుల్ని సంప్రదించగా 'అమృత పాశుపత మహా మృత్యుంజయ హోమం' జరిపిస్తే జరుగుతున్న అరిష్టాలు ఆగుతాయని, శాంతి కలుగుతుందని సూచించారు. అందరి మంచిని ఆకాంక్షిస్తూ ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ఈ హోమం చేస్తే యావత్ చిత్ర పరిశ్రమకు మంచి జరుగునని నిర్ణయం తీసుకోవడమైనది. దీనికి విశాఖ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మాహాస్వామి ఈ హోమం జరిపించడానికి అంగీకరించారు. దీంతో మా ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు 'శాంతి హోమం' జరిపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని మా ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మురళీమోహన్ శుక్రవారం(మార్చి 13) న ఫిలింనగర్ దైవ సన్నిధిలో తెలిపారు. ఈ హోమం మార్చి 23 నుండి 25 వరకు ఫిలిం నగర్ దేవాలయంలో జరిపారు. మార్చి 25న జరిగిన పసుపత మృత్యుంజయ యాగం పూర్ణాహుతికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ "ఈ మధ్యకాలంలో సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాల కారణంగా సినీ పెద్దలందరూ కలిసి ఈ మృత్యుంజయ హోమాన్ని నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఈ హోమాన్ని జరిపించడం శుభపరిణామం. ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే సినీకళాకారుల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు" అని తెలిపారు.

మురళీమోహన్ మాట్లాడుతూ "ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, మనిఖ్యాలరావు గారికి, కృష్ణం రాజుకి, కృష్ణకి అందరికి పేరుపేరునా నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంతో ఇకపై నష్టాలు జరగకుండా ఉంటాయని భావిస్తున్నాను" అని అన్నారు.

 సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ "మూడో రోజున జరిగిన ఈ పూర్ణహుతిలో పాల్గొన్న అందరికి శక్తి లభిస్తుంది. సినీ పరిశ్రమ చక్కగా వర్ధిల్లాలి" అని అన్నారు.

కృష్ణ మాట్లాడుతూ "చాలా మంది సినీకళాకారులు దూరం అయిపోయారు. ఇంతమంది ఒకేసారి దూరం అవడం ఎప్పుడు జరగలేదు. ఈ మరణాలు ఆగడానికి మురళీమోహన్ గారు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. సినీకళాకారుల శ్రేయస్సును కోరుకునే ఆయనకు నా ధన్యవాదాలు" అని తెలిపారు.

కృష్ణంరాజు మాట్లాడుతూ "శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ప్రత్యక్షంగా ఈ యాగాన్ని జరిపించడం సంతోషకరమైన విషయం. ఎందరో మహానుభావులు వచ్చి ఈ యాగాన్ని జరిపించి విజయవంతం చేసారు" అని అన్నారు.

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ "మూడు రోజులుగా రోజుకు 9 గంటల చొప్పున అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిష్టగా పూర్తి చేసాం. సినీపరిశ్రమ బాగు కోసం మురళీమోహన్ గారు ఎంతో నిష్టగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు" అని చెప్పారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement